Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Chandrababu: నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే.. నేడు గుమ్మడికాయ కొట్టింది మనమే!..

MAHAA News 3 weeks ago

Chandrababu: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం సరికొత్త చరిత్రకు నాంది పలికింది! ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే..

నేడు విజయవంతంగా పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా గుమ్మడికాయ కొట్టింది కూడా మనమే!”అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 1) ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా

ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన స్థానిక రైతులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు..

ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతు సోదరులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు కేవలం భూములను మాత్రమే ఇవ్వలేదు.. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక బంగారు భవిష్యత్తును, ప్రగతిని బహుమతిగా ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర దశ, దిశ పూర్తిగా మారిపోతాయి.

కష్టాల్లో ఉన్న ఏపీకి మోదీయే ఆక్సిజన్!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఆంధ్రప్రదేశ్‌కు ఆయన అందిస్తున్న నిరంతర సహకారాన్ని సీఎం కొనియాడారు..

  • రాష్ట్రానికి ప్రాణవాయువు:రెండేళ్ల క్రితం తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించే క్రమంలో ప్రధాని మోదీ ఒక ‘ఆక్సిజన్’లా నిలిచి అండగా నిలిచారు.

  • కీలక హామీల సాకారం: విశాఖపట్నం రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారాల పరిరక్షణకు కేంద్రం పూర్తి మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు.

  • అమరావతి పునర్నిర్మాణం:రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను శరవేగంగా పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

హేళన చేసినవారు అడ్రస్ లేకుండా పోయారు!

ఒకప్పుడు ఈ ప్రాంతానికి కనీసం ఎర్రబస్సు కూడా సరిగ్గా రాదని అవహేళన చేసినవారు ఇవాళ అడ్రస్ లేకుండా పోయారు. ఇవాళ ఇక్కడ అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అవుతున్నాయి అని ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.

గూగుల్, ప్రధాన ఉక్కు కంపెనీలతో పాటు ఇప్పటికే అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని తెలిపారు. రూ. 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ఉత్తరాంధ్ర నుంచి వలసలను పూర్తిగా నివారిస్తామన్నారు.

నేషన్ ఫస్ట్ ప్రధాని

గడిచిన 12 ఏళ్లుగా దేశంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న ఇటువంటి గొప్ప నాయకుడిని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు కొనియాడారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్-1 దేశంగా ఎదగడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News