Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Chandrababu: విభజన గాయాల నుంచి 'బ్రాండ్ ఆంధ్ర' పునరుద్ధరణ వరకు.. వాస్తవాలు వెల్లడించిన సీఎం!

MAHAA News 1 week ago

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాలనా వ్యవస్థపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శ్వేతపత్రం (White Paper) విడుదల చేశారు.

2024కి ముందు ఉన్న దారుణ పరిస్థితులు, తమ ప్రభుత్వం వచ్చాక పుంజుకుంటున్న ఆర్థిక సంస్కరణలను వాస్తవాలతో సహా ప్రజల ముందు ఉంచారు.

సమర్థవంతమైన పాలన (Good Governance) ఉంటే దాని ఫలితాలు ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తాయని, రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసేలా చేయడం ఒక బాధ్యతగల ప్రభుత్వ ప్రాథమిక విధి అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

తలసరి ఆదాయం: తెలంగాణతో పోలిస్తే ఏపీ ఎక్కడ ఉంది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయం నుంచి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వరకు తలసరి ఆదాయం (Per Capita Income)లోని వ్యత్యాసాలను సీఎం చంద్రబాబు స్పష్టంగా వివరించారు..

  • విభజన నాటికి (2014): ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం ₹95,231 ఉండేది. విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం ₹1,24,104 కాగా, ఏపీ తలసరి ఆదాయం ₹93,903కు పడిపోయింది.

  • ప్రస్తుత అంచనాలు (2025-26): ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం ₹4,18,931 సాధిస్తుండగా, ఏపీ తలసరి ఆదాయం ₹2,94,507 గా ఉందన్నారు.

  • వృద్ధిరేటు తగ్గుదల నష్టం: 2019-24 మధ్య ఐదేళ్లలో జీఎస్‌డీపీ (GSDP) వృద్ధిరేటు 3.18% పడిపోవడం వల్ల రాష్ట్రానికి ఏకంగా ₹6.94 లక్షల కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీఎం పేర్కొన్నారు.

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు!

గత వైసీపీ పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని, అమరావతి పనులను నిలిపివేయడం, పోలవరం ధ్వంసం చేయడం, ప్రజావేదికను కూల్చివేయడం వంటి చర్యలు రాష్ట్రానికి శరాఘాతంగా మారాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  • 2024 చారిత్రాత్మక విజయం: ఈ భయంకరమైన పరిస్థితులకు చరమగీతం పాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు 57% ఓట్లతో ఊహించని విప్లవాత్మక విజయాన్ని (94% స్ట్రైక్ రేట్) అందించారని గుర్తుచేశారు.

  • బ్రాండ్ ఆంధ్రా పునరుద్ధరణ: దెబ్బతిన్న బ్రాండ్ ఆంధ్రాను మళ్లీ నిలబెట్టి, పరిశ్రమలు ఇంకా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువస్తున్నామని తెలిపారు.

  • భోగాపురం విమానాశ్రయం: ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే దానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా సిద్ధం చేసి ప్రారంభోత్సవానికి తీసుకురావడమే నిదర్శనమని చెప్పారు.

సంక్షేమం - కేంద్ర నిధుల వినియోగం

రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని సీఎం స్పష్టం చేశారు..

  1. సంక్షేమ వ్యయం: ఇప్పటివరకు సంక్షేమ పథకాల కోసం ₹49,401 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

  2. కేంద్ర పథకాల పునరుద్ధరణ: గతంలో మళ్లించిన 86 కేంద్ర ప్రయోజిత పథకాలను రివైవ్ చేసి, వాటి కింద ₹45,138 కోట్లను ఖర్చు చేశామన్నారు.

  3. రూ.29,259 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు: గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన ₹48,616 కోట్ల బిల్లులలో ఇప్పటికే ₹29,259 కోట్లు చెల్లించి కాంట్రాక్టర్లకు, వర్కర్లకు ఉపశమనం కలిగించామని చెప్పారు.

  4. మహిళా సాధికారత: మహిళా సంఘాల అభివృద్ధికి ₹14,757 కోట్లతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 97% మహిళా సంఘాలు బ్యాంకింగ్ రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News