Dailyhunt

Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానం

MAHAA News 2 weeks ago

Nara Lokesh: తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరగనున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలకు విచ్చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ఆహ్వానం అందింది.

ఆలయ పాలక మండలి (ట్రస్ట్ బోర్డు) ఛైర్మన్ శ్రీ కట్టా మహేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా మంత్రి శ్రీ లోకేశ్ గారిని కలిసి అమ్మవారి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి గ్రామదేవత, సాక్షాత్తు ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెల్లెలిగా పూజలందుకునే గంగమ్మ తల్లి జాతర విశిష్టతను, పురాతన సంప్రదాయాలను మంత్రికి ఆయన సవివరంగా తెలియజేశారు.

ఈ ఏడాది మే 5వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు గంగమ్మ జాతర అత్యంత ఘనంగా జరగనుంది. ఈ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చేస్తున్న విస్తృత ఏర్పాట్ల గురించి చైర్మన్ మంత్రికి వివరించారు.

ముఖ్యంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వేగవంతమైన దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ పంపిణీ, విచ్చేసే భక్తులందరికీ అన్నదానం, ప్రసాదాల పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు మరియు సీసీటీవీ నిఘా పెట్టారు.

ఆలయ చైర్మన్ అందించిన ఆహ్వాన పత్రికను స్వీకరించిన మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు సంతోషం వ్యక్తం చేశారు. జాతరను అత్యంత వైభవంగా, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News