Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనాకు 19వ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు

చైనాకు 19వ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు

న్యూఢిల్లీ: బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను చైనా స్వీకరించి, 2027లో 19వ వార్షిక సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రకటించారు.

న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ 18వ సదస్సు ముగింపు సమావేశంలో జిన్‌పింగ్ ఈ ప్రకటన చేశారు. చైనా తదుపరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

ఇద్దరు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్న దృశ్యాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. షీ జిన్‌పింగ్ చేసిన ప్రకటనను భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్‌హువా వార్తా సంస్థ ధృవీకరించాయి. అయితే వచ్చే ఏడాది బ్రిక్స్ సదస్సు నిర్వహించే నగరం, తేదీలను ఇంకా ప్రకటించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu