Dailyhunt
ఎపి: టెన్త్ ఫలితాల్లో బాలికలదే హవా

ఎపి: టెన్త్ ఫలితాల్లో బాలికలదే హవా

మరావతి: ఎపిలో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేష్ పదోతరగతి ఫలితాలు విడుదల చేశారు. పదోతరగతి ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.

బాలికల ఉత్తీర్ణత శాతం 87.90, బాలురు ఉత్తీర్ణత 82.68. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం ఉత్తీర్ణత, గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,161 పాఠశాలల్లో వంద శాతం, 16 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత. పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతం, చివరి స్థానంలో అల్లూరి జిల్లా 57.12 శాతం, రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఈ సారి అత్యధికంగా 96.04 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu