కోల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లాలో కోల్లాపూర్లోని పిజి కాలనీలో ప్రిన్సిపాల్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు.
ప్రిన్సిపాల్ విద్యార్థిపై లైంగిక దాడికి ప్రయత్నించాదు. దీంతో సదరు ప్రిన్పిపాల్ ప్రైవేటు పార్ట్ ను విద్యార్థి కొరకడంతో అతడికి రక్తస్రావమైంది. టిసి కోసం వెళ్తే వేధింపులకు గురి చేశాడని బాధితుడు ఆరోపణలు చేశాడు. విద్యార్థులు అక్కడికి చేరుకోవడంతో ప్రిన్సిపాల్ నగ్నంగా పారిపోయాడు. ప్రిన్సిపాల్ తీరుపై విద్యార్థులు ఆందోళన చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

