గతేడాదితో పోలిస్తే 65 శాతం క్షీణత
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది.
పెరిగిన విక్రయాలు
కంపెనీ నికర విక్రయాలు గతేడాదిలో రూ.17,689 కోట్ల నుంచి ఈసారి రూ.19,297 కోట్లకు పెరిగాయి. ఎలక్ట్రానికి పరికరాల సరఫరాలో అంతర్జాతీయ కొరత వల్ల రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం 3,79,541 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా అమ్మకాలు చూస్తే 3,20,133 యూనిట్లు నమోదయ్యాయ. ఎగుమతుల విషయానికొస్తే 59,408 యూనిట్లు నమోదవగా, ఇటీవల ఏ త్రైమాసికంలో ఇంతలా ఎగుమతులు లేవు. గతేడాది(2020) ఇదే సమయంలో కంపెనీ మొత్తం విక్రయాలు 3,93,130 కోట్లు నమోదవగా, గతేడాది దేశంగా 3,70,619 యూనిట్లు, ఎగుమతి మార్కెట్ పరంగా 22,511 యూనిట్లు నమోదైనాయి.
2 లక్షల పెండింగ్ ఆర్డర్లు
దేశీయంగా కార్ల తయారీకి ఎలక్ట్రానిక్ పరికరాల కొరత ఎక్కువగా ఉంది. దీంతో సంస్థ అంచనా వేసిన 1,16,000 వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. సెప్టెంబర్ ముగింపు నాటి దాదాపు 2 లక్షల పెండింగ్ కస్టమర్ ఆర్డర్లు ఉన్నాయి. డెలివరీలను వేగవంతం చేసేందుకు కంపెనీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ఎబిటా రూ.1,933 కోట్ల నుంచి రూ.854 కోట్లకు అంభ 55.8 శాతం పడిపోయాయి. ఎబిటా మార్జిన్ కూడా 10.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోయింది.
Maruti suzuki Q2 net profit dives 65% to Rs 475 cr

