షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ
ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది : ఎస్ఇసి పార్థసారధి
కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి
పోలింగ్కు 72గంటల ముందే ప్రచారం నిలిపివేత
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా ఉధృతి దృష్టా రాష్ట్రంలో రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా? లేదా..? అన్న అంశంపై ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి స్పష్టం చేశౠరు. కొవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అ మలు చేస్తామని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం ఎస్ఇసికి తెలిపింది.
ఈ నేపథ్యంలో గురువారం ఎస్ఇసి అధికారులతో చర్చించి, ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎస్ఇసి పార్థసారథి మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు. అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నామ ని చెప్పారు. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని పేర్కొన్నారు. రాత్రి 7 ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు. పోలింగ్కు 72 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలని ఆదేశించారు. దాంతో ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.
No change in Municipal elections schedule says SEC

