మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం కానుంది. రుతుపవనాలు తొలుత ఈనెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
అయి తే నాలుగైదు రోజులు ఆలస్యంగా తీరాన్ని తాకే అవకాశం ఉందని తాజాగా తెలిపిం ది. తెలంగాణలోకి జూన్ 5 నుంచి 10 తేదీల్లో నైరుతి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పింది. ఈ ఏడాది మాన్సూన్ సీజన్పై ఎల్నినో ప్రభావం పడనుందని జూన్, జు లై, ఆగస్టు, సెప్టెంబర్లో దీని ప్రభావం చూ పనుందని వెల్లడించింది. దీంతో తెలంగాణలో లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

