Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాణాంతక వైరస్.. సముద్రంలో నిల్చిపోయిన నౌక

పాణాంతక వైరస్.. సముద్రంలో నిల్చిపోయిన నౌక

ఫ్రికా తీరంలో ఉన్న డచ్ క్రూయిజ్ నౌక ఎంవి హోండియస్ లో ప్రమాదకరమైన హంటా వైరస్ వ్యాప్తి చెంది ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యంతో ప్రాణభయంతో బాధపడుతున్నారు.

ఈ వైరస్ రోడెంట్స్ అనే ఎలుకల ద్వారా సోకుతుంది. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులను కలిగిస్తుంది. మృతుల్లో ఇద్దరు డచ్ దంపతులు, జర్మన్ పౌరుడు ఉన్నారు. ప్రస్తుతం నౌకలో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. నౌకను కేప్‌వర్డ్ తీరంలో నిలిపివేశారు. ఈ వైరస్ నౌకలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమానిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ , షిప్ ఆపరేటర్ వెల్లడించిన వివరాల ప్రకారం అర్జెంటీనా నుంచి ఈ నౌక బయల్దేరింది.

అంటార్కిటికా, అట్లాంటిక్ మహా సముద్రంలో వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే అంతలోనే వైరస్ వ్యాప్తి చెందడంతో సహాయం కోసం నౌక నుంచి స్థానిక అధికారులకు అభ్యర్థన వెళ్లినా ప్రజారోగ్య దృష్టా నౌక నుంచి వారు దిగడానికి అనుమతి లభించలేదని కేప్ వెర్డే ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మే 4 నాటికి 7 హంటా వైరస్ కేసులు వెలుగు లోకి వచ్చాయి. మృతి చెందిన జర్మన్ జాతీయుడి మృతదేహం ఇప్పటికీ ఆ నౌకలోనే ఉందని మీడియా వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu