నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య తన భర్తలు దారుణంగా హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది.
గంగాపూర్కు చెందిన ముత్యంరెడ్డిని అతని భార్య.. ప్రియుడు చింటు సాయంతో హత్య చేసింది. ఆ తర్వాత జెసిబితో గొయ్యి తీసి భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారించడంతో 9 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు.

