తిరుపతి: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు.
36,705 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

