హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రాజీని భర్త రాకేశ్ గొంతు నులిమి చంపేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బిహార్కు చెందిన రాజీని ఆరు సంవత్సరాల క్రితం రాకేశ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

