లండన్: మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్ సమరానికి సౌతాఫ్రికా, ఇంగ్లండ్లు సిద్ధమయ్యాయి. లీగ్ దశలో ఇంగ్లండ్ ఆడిన ఐదు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్కు చేరుకుంది.
సౌతాఫ్రికా కూడా ఐదింటిలో నాలుగు మ్యాచుల్లో జజయకేతనం ఎగుర వేసి ముందంజ వేసింది. ఈ క్రమంలో భారత్ వంటి బలమైన జట్టును ఓడించింది.
ఇంగ్లండ్తో జరిగే సెమీస్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇరు జట్లలోనూ స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఆస్ట్రేలియా తొలి సెమీస్లో విండీస్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది.

