న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన తొలి టి20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఓమర్ జాయ్ 44 బంతుల్లో 64 (నాటౌట్), మహ్మద్ నబి (33) జట్టును ఆదుకున్నారు.
భారత బౌలర్లలో అర్ష్దీప్ మూడు వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. అబిషేక్ శర్మ 32 బంతుల్లో 82, ఇషాన్ కిషన్ (42) జట్టును గెలిపించారు.

