న్యూఢిల్లీ : భారత్ కనెక్ట్ ద్వారా వాట్సాప్లో కరెంటు, గ్యాస్, వాటర్ వంటి బిల్లుల చెల్లింపు సేవలు ప్రారంభమయ్యాయి. ఇది 30 కేటగిరీల లో 22,722 బిల్లింగ్ సంస్థలకు అందుబాటులో ఉంటుంది.
యూజర్లు రూపాయి గుర్తుపై క్లిక్ చేసి యుపిఐ, కార్డ్లతో చెల్లించవచ్చు. సందేశం పంపినంత సులభంగా బిల్లులు కట్టేలా చేయడమే సంస్థ లక్ష్యమని మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ తెలిపారు.

