Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీఈడీ కోర్సుకు భారీ డిమాండ్..ఎడ్‌సెట్ ఫస్ట్ ఫేజ్‌లోనే వేల సీట్లు భర్తీ!

బీఈడీ కోర్సుకు భారీ డిమాండ్..ఎడ్‌సెట్ ఫస్ట్ ఫేజ్‌లోనే వేల సీట్లు భర్తీ!

Merupulu 1 week ago

పాధ్యాయ వృత్తి వైపు మళ్లీ అడుగులు పడుతున్నాయి. కొన్నాళ్లుగా కాస్త వెనకబడిన బీఈడీ కోర్సుపై యువత ఇప్పుడు ఆసక్తి చూపుతోంది. ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో తొలి విడతలోనే సీట్లు ఇట్టే భర్తీ అయిపోతుండటం ఇందుకు నిదర్శనం.

గతంతో పోలిస్తే.. ఈసారి అభ్యర్థుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే.. టీచర్ ట్రైనింగ్ కోర్సులకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా వెలువడిన ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలు..

రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటాలో మొత్తం 13,695 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి ఏకంగా 15,009 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. ఈ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టే స్పష్టమవుతోంది. ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తొలి విడతలోనే ఏకంగా 9,407 మంది అభ్యర్థులు సీట్లు దక్కించుకున్నారు.

గత సంవత్సరంతో పోలిస్తే.. ఈసారి మొదటి విడతలోనే రికార్డు స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. గత ఏడాది తొలి విడతలో కేవలం 4,474 మంది మాత్రమే రిపోర్ట్ చేయగా, రెండో విడత కలిపి 11 వేలకు పైగా సీట్లు నిండాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఒక విడతలోనే దాదాపు 9,407 మందికి సీట్లు భర్తీ కావడం గమనార్హం. ఇందులోనూ మహిళల హవానే స్పష్టంగా కనిపిస్తోంది. కేటాయించిన సీట్లలో ఏకంగా 81.85 శాతం సీట్లను మహిళలే ఉండటం విశేషం.
మరోవైపు, సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Merupulu