రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలు,ప్రైవేట్ కాలేజీల్లో ఎం.టెక్,ఎం.ఈ,ఎం.ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ పీజీఈసెట్ ( TG PGECET 2026) అప్లికేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఆధ్వర్యంలో ఈ ఏడాది జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTUH) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.ఇంజనీరింగ్, ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులు తమ కెరీర్ను కొనసాగించడానికి ఈ ప్రవేశ పరీక్ష ఒక గేట్వే లాంటిది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు:
1.సంబంధిత సబ్జెక్టుల్లో (B.E/B.Tech/B.Pharm) కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (రిజర్వేషన్ అభ్యర్థులకు 45%).
2.GATE లేదా GPAT స్కోర్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వారు నేరుగా కౌన్సెలింగ్కు హాజరు కావచ్చు, కానీ సీట్లు మిగిలితే PGECET రాసిన వారికి అవకాశం ఇస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: మే 6వ తేదీ వరకు అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.(మే 9 నుంచి మే 26 మధ్య వివిధ స్థాయిల్లో రూ.250 నుంచి రూ.10వేలవరకు లేట్ ఫీజుతో కూడా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు)
పరీక్ష ఎప్పుడు ?
ఈ ఎంట్రన్స్ పరీక్షలు మే 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతాయి. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) పరీక్షలు నిర్వహిస్తారు.
అప్లికేషన్ విధానం:
1.ముందుగా అధికారిక వెబ్సైట్ pgecet.tgche.ac.in లోకి లాగిన్ అవ్వాలి.

