వాషింగ్టన్: కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ.. అమెరికాను ‘హవానా సిండ్రోమ్’ కలవరపెడుతున్నది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్, రేడియో వేవ్ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు కనుగొనలేకపోయారు.
ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వం ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, అలాగే బాధిత అధికారులకు మెరుగైన వైద్య సంరక్షణను అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది.
No Internet connection |