Dailyhunt

24 గంటల్లో 75 పాజిటివ్ కేసులు : కేంద్ర ఆరోగ్యశాఖ

హైదరాబాద్‌: దేశంలో ఇప్పటి వరకు 724 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయినట్లు తెలిపారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, నలుగురు మృతిచెందినట్లు చెప్పారు. కరోనా చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ ప్రకటించారు. మెడికల్ స్టాఫ్‌కు సుమారు 50 లక్షల మేర బీమా చెల్లించనున్నట్లు తెలిసింది. దీని వల్ల దాదాపు 22 లక్షల మంది వైద్య సిబ్బంది లబ్ధి పొందే అవకాశం ఉన్నది. పది వేల వెంటిలేటర్లు కావాలని పీఎస్‌యూలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు.
సుమారు 30 వేల అదనపు వెంటిలేటర్లు కావాలని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లోగా వీటిని ఏర్పాటు చేయాలని కోరినట్లు లవ్ అగర్వాల్‌ తెలిపారు.
వలస కూలీలకు ఆహారం, నీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యా సలిలా శ్రీవాత్సవ్ తెలిపారు.
హోటళ్లు, కిరాయి ఇండ్లు తెరిచి ఉంచాలన్నారు. కోవిడ్‌19 జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలన్నారు. సుమారు 1.4 లక్షల కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana