- టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే శివారు ప్రాంతాలు అభివృద్ధి
- పట్టభద్రుల అభ్యర్థి వాణీదేవిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి
- విద్యావంతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
- ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఎంపీ రంజిత్రెడ్డి,
- టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
మణికొండ/బండ్లగూడ/మైలార్దేవ్పల్లి, మార్చి 6 : ప్రజాసంక్షేమంతో పాటు విద్యావంతులకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, విద్యావంతులంతా తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.
మైలార్దేవ్పల్లి డివిజన్లో..
హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబుబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించాలని మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు టి ప్రేమ్గౌడ్ కార్యకర్తలతో కలిసి శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉదయం వాకింగ్ చేసే పట్టభద్రులకు టీఆర్పార్టీ బలపరిచిన వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించాలని వారిని కోరారు. కార్యక్రమంలో మల్లేష్ ,రమణగౌడ్ ,నిఖిల్ ,శివ తదితరులు పాల్గొన్నారు.
సురభి వాణిదేవికి మద్దతు తెలపాలి
రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని పట్టభద్రులందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఓటు వేయాలని ప్రొఫెసర్ కోరని రవీందర్ ప్రచారం నిర్వహించారు. ఆయన రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్సిటీలో ఉదయం వాకింగ్ వచ్చిన పట్టభద్రులతో చర్చించి వాణిదేవికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శర్మ, గౌతమ్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

