- స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం భాగస్వామ్యం
హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ నిర్మూలనకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం బయోటెక్నాలజీ శాఖ (డీబీటీ)తో రెడ్డీస్ జట్టు కట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీబీటీ ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ)తో భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది. డీబీటీ, బీఐఆర్ఏసీలు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రయోగశాల పరీక్షల్లో తమకు తగిన సలహాలు, సూచనలు ఇస్తాయని ఓ ప్రకటనలో సంస్థ స్పష్టం చేసింది. అలాగే ఈ భాగస్వామ్యంలో భాగంగా బీఐఆర్ఏసీకి చెందిన పలు క్లినికల్ ట్రయల్ సెంటర్లను వినియోగించుకుంటామని తెలిపింది.

