న్యూ ఢిల్లీ: నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను ఆటగాళ్లతోపాటు భారత క్రీడాభిమానులెవ్వరూ జీవితంలో మరిచిపోలేరు. ఈ ట్రోఫీని భారత్ గెలిచి నేటికి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆ జట్టులోని సభ్యుడు మహ్మద్కైఫ్ తన అనుభవాలను పంచుకున్నాడు. ట్రోఫీ గెలువగానే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినంత ఆనందం పొందినట్లు చెప్పాడు. 'జూలై 13, 2002: లార్డ్స్లో మేం ఎవరెస్టును అధిరోహించిన రోజు.. చొక్కాలేని దాదా.. నెర్వస్లెస్ యువీ.. విలువైన జాక్ మద్దతు.. నిర్భయంగా నేను.. జ్ఞాపకాలు అనంతం..' అని కైఫ్ ట్వీట్ చేశాడు.
2002లో లార్డ్స్లో ఇగ్లాండ్తో జరిగిన నాట్వెస్ట్ ఫైనల్లో భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్ 146/5 తో కష్టాల్లో పడింది. యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ ఇద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యువరాజ్ 69 పరుగులు చేసి అవుటైనప్పటికీ, కైఫ్ రెండు వికెట్ల తేడాతో భారత్కు విజయాన్ని అందించేందుకు టెయిలెండర్లతో చక్కగా బ్యాటింగ్ చేశాడు. 87 పరుగులు చేసి, మరో మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు కైఫ్. ఈ మ్యాచ్ గెలువగానే కెప్టెన్ గంగూలీ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బాల్కనీలో చొక్కా విప్పి, గాల్లో తిప్పుతూ ఆనందం వ్యక్తంచేశాడు. అప్పటి నుంచే యువరాజ్, కైఫ్కు ఇండియాలో క్రీడాభిమానులు పెరిగిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

