హైదరాబాద్ : తెలంగాణ అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గంగు భానుమూర్తి హఠాన్మరణం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ అర్చక, ఉద్యోగుల సంక్షేమం కోసం భానుమూర్తి నిరంతరం కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.

