బహుముఖ ప్రజ్ఞశాలి గొల్లపూడి మారుతి రావు మూడు రోజుల క్రితం చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన బంధువులు అందరు విదేశాలలో ఉన్న క్రమంలో ఈ రెండు రోజులు భౌతిక కాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచి శనివారం అభిమానుల సందర్శనార్ధం స్వగృహానికి తరలించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని, ప్రభ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు గొల్లపూడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరు ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం 2.30ని.ల తర్వాత టి.నగర్లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్టు తెలుస్తుంది. మారుతీరావుది, నాది గురుశిష్యులాంటి బంధం.
నేను 1979లో ఐ లవ్ యూ చిత్రం చేసినపుడు నిర్మాత భావన్నారాయణ నాకు మారుతీరావును పరిచయం చేశారు. నేను కలిసేనాటికే గొల్లపూడిగారు గొప్ప రచయిత.. జర్నలిస్టుగా కూడా పనిచేశారు.
గొల్లపూడి దగ్గర డైలాగ్స్ నేర్చుకోమని నన్ను పంపించారు. డైలాగులు ఎలా పలకాలో మారుతీరావు దగ్గర నేర్చుకున్నా. నేను నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో కొంచెం శాడిజం, కొంచెం కామెడీగా ఉండే భర్త పాత్రలో గొల్లపూడిగారు అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారని' ఆయనతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు చిరంజీవి.

