మాంచెస్టర్: తాను ఇప్పట్లో క్రికెట్కు వీడ్కోలు పలకనని ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్పష్టం చేశాడు. కనీసం 2021-22 యాషెస్ వరకైనా ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. పాకిస్థాన్తో తొలి టెస్టులో ఒకే వికెట్తో సరిపెట్టుకున్న అండర్సన్.. రిటైరవుతాడన్న వాదనలు వెలు వడగా అతడు వాటికి ఫుల్స్టాప్ పెట్టాడు.

