Dailyhunt
ఇస్రోలో ప్రైవేటు కంపెనీలకు అనుమతి : కేంద్ర మంత్రి

ఇస్రోలో ప్రైవేటు కంపెనీలకు అనుమతి : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : భారత జాతీయ అంతరిక్ష, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (INSPACe) కింద భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కేంద్ర అణుశక్తిశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు చొరవ, ప్రమేయంపై రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 'ఇస్రో మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం వారికి అనుమతిస్తుంది. అవి భారతదేశంలో మరెక్కడా అందుబాటులో లేవు. వినియోగం కోసం సహేతుకమైన ఛార్జీలు ఉంటాయి. ప్రభుత్వ మౌలిక సదుపాయాల అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి' అని పేర్కొన్నారు. 'అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడంలో ఇస్రోతో భాగస్వామి అయిన 500పైగా కంపెనీలు ఉన్నాయి.

ప్రైవేటు కంపెనీల పరిధిలోని విస్తృత ప్రాంతాలు, సెక్టార్‌ మెటీరియల్స్‌, మెకానికల్ ఫాబ్రికేషన్, ఎలక్ట్రానిక్ ఫాబ్రికేషన్, సిస్టమ్ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేషన్ మొదలైనవి' అందిస్తున్నాయని తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ కింద ప్రభుత్వం అంతరిక్ష రంగంలో వారి భాగస్వామ్యం కోసం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐఎన్‌ఎస్‌పీఏసీ'ఈని తీసుకువచ్చింది. ప్రైవేటు కంపెనీలు సైతం ఇస్రో మౌలిక సదుపాయాలను వినియోగించుకోనున్నారు. దీన్ని శాస్త్రవేత్తలు సైతం స్వాగతించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana