నిజామాబాద్ : కరోనా రాకుండా మందులు ఇస్తానని ఆశచూపి ఓ ప్రబుద్ధురాలు మత్తు మందు ఇచ్చి వృద్ధురాలి నగలతో ఉడాయించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరు.. ఈ నెల 8వ తేదీన నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు కామారెడ్డి జిల్లా భిక్కనూరులో బంధువులు చనిపోవడంతో వెళ్లేందుకు కామారెడ్డి బస్సు ఎక్కింది. ప్రయాణంలో లక్ష్మికి ఓ గుర్తుతెలియని మహిళతో పరిచయం ఏర్పడింది. కామారెడ్డికి చేరుకున్న ఇద్దరు టిఫిన్ చేసి భిక్కనూరు బస్సు ఎక్కి వెళ్లారు.
సాయంత్రం నిజామాబాద్కు ఇద్దరం కలిసి వెళ్దామని గుర్తుతెలియని మహిళ లక్ష్మికి చెప్పింది. సాయంత్రం 5 గంటలకు ఇద్దరు కలిసి ఆటోలో కామారెడ్డికి బయలుదేరారు.
ఇవి కూడా చదవండి..

