కేరళలో తాజాగా జరిగిన ఏనుగు విషాద ఉదాంతం యావత్ భారత దేశాన్ని కబలించివేస్తుంది. మనుషులను నమ్మి ఆకలితో వచ్చిన జంతువుపై తమ క్రూరమైన చర్యలతో అది మరణించేలా చేశారు కొందరు మానవత్వం లేని ఆకతాయిలు. కేరళలో ఆకలితో ఉన్న ఓ గర్బంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్లో పేలుడు పదార్థాలు ఉంచి తినేలా చేసి నోటిలో పేలేలా చేశారు ఆ మృగాలు దీంతో తీవ్ర గాయాల పాలైన ఆ ఏనుగు దయనీయ పరిస్థితిలో గుండెను కలచివేసేలా మరణించింది. దీంతో పాటు ఆ ఏనుగు గర్బంలో ఉన్న మరో జీవి మరణానికి కారణమయ్యారు ఆ దుండగులు.
ఈ ఘటనపై యావత్ భారత దేశం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే తాజాగా 'అసలేం జరిగింది' చిత్ర హీరో శ్రీరాంతో పాటు సినీ బృందం ఈ విషాద ఘటనపై తీవ్రంగా స్పందించింది.
రాను రాను మనుషుల్లో మానవత్వం ఏమైపోతుందని చిత్ర బృందం ప్రశ్నించింది. కేరళలో జరిగిన ఈ ఘటన మానవత్వానికి మచ్చ అని చిత్ర బృందం అన్నారు. ప్రజలు జంతువుల పట్ల ప్రేమను మాత్రమే చూపించాలని చిత్ర సభ్యులు కోరారు.

