కేరళలో తాజాగా జరిగిన ఏనుగు విషాద ఉదాంతం యావత్ భారత దేశాన్ని కబలించివేస్తుంది. మనుషులను నమ్మి ఆకలితో వచ్చిన జంతువుపై తమ క్రూరమైన చర్యలతో అది మరణించేలా చేశారు కొందరు మానవత్వం లేని ఆకతాయిలు. కేరళలో ఆకలితో ఉన్న ఓ గర్బంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్లో పేలుడు పదార్థాలు ఉంచి తినేలా చేసి నోటిలో పేలేలా చేశారు ఆ మృగాలు దీంతో తీవ్ర గాయాల పాలైన ఆ ఏనుగు దయనీయ పరిస్థితిలో గుండెను కలచివేసేలా మరణించింది. దీంతో పాటు ఆ ఏనుగు గర్బంలో ఉన్న మరో జీవి మరణానికి కారణమయ్యారు ఆ దుండగులు.
ఈ ఘటనపై యావత్ భారత దేశం తీవ్రంగా ఖండిస్తుంది. అయితే తాజాగా 'అసలేం జరిగింది' చిత్ర హీరో శ్రీరాంతో పాటు సినీ బృందం ఈ విషాద ఘటనపై తీవ్రంగా స్పందించింది.
శ్రీరామ్ హీరోగా నూలేటి వీర రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అసలేం జరిగింది. తెలుగులో కొంత విరామ తర్వాత హీరో శ్రీరామ్ నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచితా పదుకునే నాయికగా నటిస్తోంది. ఎక్సోడస్ మీడియా పతాకంపై శ్రీమతి నీలిమ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్ ఎన్వీఆర్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు.

