- టీకా తీసుకున్నవారు ఆందోళన చెందొద్దు
- సూర్యాపేట డీఎంహెచ్ఓ హర్షవర్ధన్
చివ్వెంల/ నూతనకల్/ ఆత్మకూర్(ఎస్), జనవరి 21 : కరోనా వ్యాక్సిన్పై అపోహలొద్దని, ప్రతిఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. చివ్వెంల, నూతనకల్, ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ను గురువారం టీకా వేయించుకున్న ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత సురక్షితమైన ఈ టీకా త్వరలో అందరికీ అంబాటులోకి వస్తుందన్నారు. టీకా వేసుకున్న వారు భయాందోళన చెందొద్దని సూచించారు.

