న్యూ ఢిల్లీ: కొవిడ్ నేపథ్యంలో వెనుకబడ్డ క్రీడారంగాన్ని మళ్లీ అభివృద్ధి బాటపట్టించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రి కిరెన్ రిజిజు దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆయన మంగళవారం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా క్రీడలు, యువతకు సంబంధించిన కార్యకలాపాల ప్రారంభానికి రోడ్మ్యాప్ను తయారుచేయాలని ఆదేశించారు.
జూలై 14, 15వ తేదీల్లో రెండు రోజుల వీడియో కాన్ఫరెన్స్లో రిజిజు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రులతో సమావేశమవుతారని గతంలో ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

