లక్నో: ఉత్తరప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి ( Mayavati ) మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు.
ఈ మధ్య కాలంలో భారీగా వర్షాలు పడటంతో పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిందని, దాంతో గతుకులమయంగా మారిన రోడ్లపై ఎక్కడ గుంత ఉందో కనపడక వాహనదారులు ఇబ్బందులు పడుతారని మయావతి విమర్శించారు. రోడ్లపై గుంతల కారణంగా ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని, పత్రికలు ఎక్కువగా రోడ్డు ప్రమాద వార్తలతో నిండిపోతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై రోడ్లను బాగుచేయించాలని మాయావతి సూచించారు.

