హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ధాన్యం కొనుగోలుకు సహకరించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మిల్లర్లను కోరారు. మిల్లర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని భరోసాఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం మిల్లర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేయాలని నిర్ణయించామని, 6,467 కేంద్రాలను ఏర్పాటుచేయనున్నామని మంత్రి చెప్పారు.1,071 కేంద్రాలను ఏర్పాటుచేసి, గురువా రంవరకు 3.15కోట్ల విలువైన 16,702టన్నుల ధాన్యాన్ని కొన్నట్టు తెలిపారు.
దాడి కేసులో మంత్రి గంగులకు ఊరట
మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేకకోర్టులో ఊరట లభించింది.

