న్యూఢిల్లీ: తాను తన తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని ఐఏఎస్కు ఎంపికైనట్లు వచ్చిన ఆరోపణలు, వదంతులు, సోషల్ మీడియా పోస్టులపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కూతురు అంజలీ బిర్లా గురువారం స్పందించారు. ఇటువంటి వదంతులు వ్యాపింపజేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టం తేవాలన్నారు. వదంతులు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, జవాబుదారీ చేయాలన్నారు. ఈ రోజు తాను బాధితురాలిని అయినట్లే, భవిష్యత్లో మరొకరు బాధితులు కావచ్చునన్నారు. ఐఏఎస్కు జరిగిన పరీక్షల్లో తొలిదశలోనే మూడు పరీక్షల్లోనూ పాస్ అయ్యారు అంజలీ బిర్లా.
అంతే కాదు సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలు-2019లో మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కానీ అంజలీ బిర్లా..

