- l రాష్ట్రంలో అందుబాటులో తగినంత యూరియా
- l ఇప్పటికే 6.29 లక్షల టన్నులు కొన్న రైతులు
- l క్షేత్రస్థాయిలో ఇంకా లక్ష టన్నుల యూరియా
- l త్వరలో కేంద్రం నుంచి 2.50 లక్షల టన్నులు రాక
- l సాగు పెరుగడంతో రైతుల నుంచి భారీ డిమాండ్
- l ఆందోళనతో ముందస్తుగా కొంటున్న అన్నదాతలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వానకాలం సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. అందుకనుగుణంగా ప్రభుత్వం అవసరమైన ఎరువులను సిద్ధంచేసింది. వానకాలం సాగుకు అవసరమైన యూరి యా అందుబాటులో ఉన్నదని, అన్నదాతలు ఎవరూ అందోళన చెందవద్దని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. ఈ సీజన్లో 10 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా..
ఎరువుల వాడకాన్ని తగ్గించండి.. రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు
వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని భారీగా తగ్గించాల ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు సూచించారు. మోతాదుకు మించి ఎరువుల వాడకం వల్ల తెగు ళ్లు, పురుగుల బెడద ఎక్కువవుతుందని చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్ సెరికల్చర్ కార్యాలయం లో వానకాలం ఎరువుల సరఫరాపై ఫర్టిలైజర్స్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వానకాలంలో ఇప్పటికే 1.17కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయన్నారు. కేంద్రం తెలంగాణ కు 22.30 లక్షల టన్నుల ఎరువులను కేటాయించగా, సోమవారం వరకు 16.15 లక్షల టన్నులు సరఫరా చేసిందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుబీమా చెల్లించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు
కరోనా కష్టకాలంలోనూ రైతుబీమా పథకం ప్రీమియం చెల్లించిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 2020-21 సంవత్సరానికిగాను ప్రభుత్వం రైతుబీమా కోసం రూ.1,173.54 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రీమియం ఈ ఏడాది ఆగస్టు 14 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13 వరకు వర్తిస్తుందని తెలిపారు. రెండేండ్లలో 32,267 మంది రైతు కుటుంబాలకు బీమా చెల్లించినట్టు పేర్కొన్నారు.

