Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi | కర్ణాటకలో 'పెద్ది' ప్రభంజనం.. పవన్ కళ్యాణ్ 'ఓజీ' రికార్డు బ్రేక్, రామ్ చరణ్ కొత్త చరిత్ర!

Peddi | కర్ణాటకలో 'పెద్ది' ప్రభంజనం.. పవన్ కళ్యాణ్ 'ఓజీ' రికార్డు బ్రేక్, రామ్ చరణ్ కొత్త చరిత్ర!

Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పగా, ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా రికార్డుల వేట మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా 'పెద్ది'కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ సినిమా ఓపెనింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రీమియర్ షో కలెక్షన్ల లెక్కల ప్రకారం, కర్ణాటకలో 'పెద్ది' ఏకంగా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో కర్ణాటకలో అత్యధిక ప్రీమియర్ గ్రాస్ సాధించిన సినిమాగా 'పెద్ది' నిలిచినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకుముందు ఈ రికార్డు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' పేరిట ఉండేది. ఆ చిత్రం ప్రీమియర్ షోల ద్వారా కర్ణాటకలో రూ.2.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు 'పెద్ది' ఆ మార్క్‌ను అధిగమించి కొత్త చరిత్ర నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో రామ్ చరణ్ మార్కెట్ రేంజ్ మరోసారి స్పష్టమైందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సినిమాకు వస్తున్న స్పందనలో ప్రధానంగా రామ్ చరణ్ నటన గురించి చర్చ జరుగుతోంది. పెద్ది పాత్రలో ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, మాస్ అప్పీల్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సాన కూడా తన రెండో చిత్రంతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రామీణ నేపథ్యం, క్రీడా అంశాలు, భావోద్వేగాలను సమతూకంగా మేళవిస్తూ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు.ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ విలువల పరంగా కూడా ప్రశంసలు అందుకుంటోంది. కర్ణాటకలోనే కాకుండా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదు చేస్తున్న 'పెద్ది' తొలి రోజు, తొలి వీకెండ్ వసూళ్లలో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీమియర్ షోలతోనే సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana