Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రశాంత్‌నీల్‌ పౌరాణిక సిరీస్‌

ప్రశాంత్‌నీల్‌ పౌరాణిక సిరీస్‌

'కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ సినిమాలన్నీ దాదాపుగా డార్క్‌థీమ్‌లో కనిపిస్తాయి. ప్రతీ ఫ్రేమ్‌లో బ్లాక్‌టింట్‌ ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అవుతుంటుంది.

మాఫియా, అండర్‌వరల్డ్‌ తాలూకు ప్రపంచాలను బ్లాక్‌కలర్‌ థీమ్‌తో ప్రజెంట్‌ చేయడం ఆయన మేకింగ్‌ ైస్టెల్‌గా చెబుతారు. ఇదిలావుండగా ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌నీల్‌ రూపొందిస్తున్న తాజా చిత్రం 'డ్రాగన్‌’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. సోషల్‌మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలతో దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్‌నీల్‌ ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.

తాను ప్రస్తుతం ఓ పౌరాణిక సినిమా సిరీస్‌ మీద వర్క్‌ చేస్తున్నానని, అది కలర్‌ఫుల్‌ విజువల్స్‌తో, గ్రాఫిక్స్‌ హంగులతో తన రెగ్యులర్‌ ైస్టెల్‌కు భిన్నంగా ఉంటుందన్నారు. తాను తెరపై సృష్టించే చీకటి ప్రపంచాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని, తనలోని కొత్త క్రియేటర్‌ను చూస్తారని చమత్కరించారు. అదే సమయంలో భారీ చిత్రాలతో పాటు ఓ చిన్న కుటుంబ కథా చిత్రాన్ని కూడా తీయాలనే ప్రయత్నంలో ఉన్నానని ఆయన తెలిపారు. 'డ్రాగన్‌’ తర్వాత తాను ప్రభాస్‌తో 'సలార్‌-2' షూట్‌కు సిద్ధమవుతున్నానని ప్రశాంత్‌నీల్‌ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana