న్యూఢిల్లీ: ఈ నెల ఆఖరి వారంలో ఐదు రోజులపాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఆన్లైన్ దావోస్ ఎజెండా సమ్మిట్ జరుగనుంది. జనవరి 25-29 వరకు జరుగనున్న ఈ సదస్సులో వివిధ దేశాధినేతలతోపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 28న సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే అవకాశం ఉన్నది. ప్రధాని మోదీతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా WEF ఆన్లైన్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
భారత్ నుంచి ప్రధానితోపాటు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్, బడా వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదితరులు ఈ WEF సదస్సులో పాల్గొననున్నారు.

