నవతెలంగాణ - రెంజల్ : ప్రజల మండల దూపల్లి గ్రామంలో 12వ వార్డులో తాగునీటి సమస్య తలెత్తడంతో సర్పంచ్ ధనుర్ నరసవ్వ వెంటనే స్పందించి కొత్త మోటర్ ను బిగించి కాలనీవాసులకు తాగునీటి సమస్యను పరిష్కరించారు.
వేసవిలో తావు నీటి ఎద్దడి లేకుండా తమ గ్రామంలో అన్ని వార్డులలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యుడు అజయ్ యాదవ్, కాలనీవాసులు మహిళలు పాల్గొన్నారు.

