- మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా
నవతెలంగాణ-జవహర్ నగర్
ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంలో అవకతవకలు లేకుండా చూడాలని జవహర్ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరద బాధితుల సహాయ నిమిత్తం 10 వేల రూపాయలు వరద బాధితులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పటికీ జవహర్ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు కార్పొరేటర్లు చేతివాటం ప్రదర్శింస్తున్నారని అన్నారు.

