- మహిళలపై సుప్రీంకు అపార గౌరవం ఉంది:దుమారం రేపిన వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ బోబ్డే వివరణ
న్యూఢిల్లీ : మహిళలపై సుప్రీంకోర్టుకు ఒక వ్యవస్థగా అత్యంత గౌరవం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ బోబ్డే సోమవారం స్పష్టం చేశారు. రేపిస్టును పెళ్లి చేసుకుంటావా అన్న వ్యాఖ్యలపై పెద్దయెత్తున దుమారం రేగడంతో ఆయన సోమవారం నాడు ఈ వివరణ ఇచ్చారు.
రేప్ కేసులో తాను ఇచ్చిన రూలింగ్ను తప్పుగా రిపోర్టు చేశారని ఆయన సెలవిచ్చారు. గర్భ విచ్చిత్తికి అనుమతించాలని కోరుతూ 14 ఏండ్ల లైంగికదాడి బాధితురాలు వేసిన పిటిషన్పైైె విచారణ సందర్భంగా బోబ్డే ఆమెను పెండ్లి చేసుకుంటావా అని లైంగికదాడి కేసులో నిందితుడ్ని ప్రధాన న్యాయమూర్తి అడగడంపై ఐద్వా నాయకురాలు బృందాకరత్, ఇతర మహిళా సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. దీంతో చీఫ్ జస్టిస్ ఎట్టకేలకు నోరు విప్పారు. ''బాధితురాలిని పెండ్లి చేసుకోమని మేం నిందితుడ్ని అడగలేదు. పెండ్లి చేసుకోబోతున్నావా అని మాత్రమే ప్రశ్నించాం. అంతేగానీ, అతడికి ఎలాంటి ఆదేశాలివ్వలేదు'' అని బోబ్డే చెప్పారు.
