హైదరాబాద్ : ప్రతి ఏటా దసరా అనంతరం నిర్వహించే అలయ్- బలయ్ కార్యక్రమం ఆదివారం జలవిహార్ లో ప్రారంభమైంది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ మండలి ప్రొటెం చైర్మెన్ భూపాల్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు.

