Dailyhunt
బెంగాల్ సీఎం మమత ఇటలీ టూర్కు కేంద్రం అనుమతి నిరాకరణ

బెంగాల్ సీఎం మమత ఇటలీ టూర్కు కేంద్రం అనుమతి నిరాకరణ

హైదరాబాద్ : ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

'రాజకీయ కోణం' నేపథ్యంలో ఆమె క్లియరెన్స్‌ను తిరస్కరించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే హోదాకు అనుగుణంగా ఆ కార్యక్రమం జరుగడం లేదని పేర్కొంది. అక్టోబర్‌లో మదర్ థెరిస్సా నేపథ్యంలో ఇటలీలో ప్రపంచ శాంతి సమావేశం జరుగనున్నది. కార్యక్రమ నిర్వాహకులు మమతను ఆహ్వానించారు.

అయితే ప్రతినిధులతో కలిసి రావద్దని ఇటలీ ప్రభుత్వం ఇటీవల మమతను కోరింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ ప్రతినిధి క్లియరెన్స్‌ను సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీని కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆమె అభ్యర్థించారు. అయితే ఆ అనుమతిని కేంద్రం నిరాకరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana