న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకుపైగా పాజిటివ్ నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

