Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎబోలా ఎఫెక్ట్.. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా..!

ఎబోలా ఎఫెక్ట్.. భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు వాయిదా..!

వతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం రేపుతుండటంతో ఢిల్లీలో జరగాల్సిన నాలుగో 'భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ (India-Africa Forum Summit)' వాయిదా పడింది.

మే 28 నుంచి 31 వరకు జరగాల్సిన ఈ సదస్సును ప్రస్తుత ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో 'ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)' ఇటీవల అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్రికాలో ఎబోలాను అదుపు చేయడానికి 'ఆఫ్రికా సీడీసీ' తీసుకుంటున్న చర్యలకు భారత్ తన పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana