Dailyhunt
ఈటల నియోజకవర్గంలో కొనసాగుతున్న బదిలీలు

ఈటల నియోజకవర్గంలో కొనసాగుతున్న బదిలీలు

హైదరాబాద్ : మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్ రావు, జమ్మికుంట సీఐ రమేశ్, హుజురాబాద్ టౌన్ సీఐ సదన్ కుమార్ ను..కరీంనగర్ డీఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసింది ప్రభుత్వం. హుజురాబాద్ ఆర్డీవో బెన్ షాలోమ్, హుజురాబాద్ తహశీల్దార్ బావ్ సింగ్ తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ ఎంపీడీవోలను కూడా ఇప్పటికే బదిలీ చేసింది సర్కార్.

హైదరాబాద్ : మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి.

తాజాగా జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్ రావు, జమ్మికుంట సీఐ రమేశ్, హుజురాబాద్ టౌన్ సీఐ సదన్ కుమార్ ను..కరీంనగర్ డీఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసింది ప్రభుత్వం. హుజురాబాద్ ఆర్డీవో బెన్ షాలోమ్, హుజురాబాద్ తహశీల్దార్ బావ్ సింగ్ తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ ఎంపీడీవోలను కూడా ఇప్పటికే బదిలీ చేసింది సర్కార్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana