హైదరాబాద్ : ఎన్నికల గుర్తులను సవరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ గుర్తులను ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగిరీలో ఉంచింది.

