హైదరాబాద్ : ఏపీ మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు ఉంటాయని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం చెప్పారని గుర్తు చేశారు.
విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు చెప్పానని బాలినేని స్పష్టం చేశారు. 'మంత్రి పదవి పోయినా నేను భయపడను. నాకు పార్టీ ముఖ్యం, పదవులు కాదు' అని పేర్కొన్నారు.

