
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన వారికి వేగంగా రుణాలివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 23 రుణ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్లోని హరిహర కళా భవన్, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. హరిహర కళా భవన్లో జరిగిన కార్యక్ర మాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాల్లో రుణాల జారీని పెంచాలని బ్యాంక్ అధికారులను కోరారు. ఈ సమావేశానికి ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రన్. ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.