నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్పై 'కొత్త దాడులు' చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.

